Home / Telangana
PCC Chief: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇలాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముందుగానే ప్రజలకు తెలియజేయడం సరైనది కాదన్నారు. ప్రస్తుతం కోర్టు […]
Telangana: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్, ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా వీరికి మే 22 నుంచి మే 29 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇవాళ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే పరీక్షలకు […]
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. […]
Telangana: రాష్ట్రంలో పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి పీజీఈసెట్- 2025 ఆన్ లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ నేటి నుంచి జరగనున్నాయి. ఈనెల 19 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాల అనంతరం పీజీఈసెట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ […]
ACB Enquiry: ఫార్ములా ఈ కార్ రేసు కేసును ఆరు నెలలుగా విచారిస్తున్నారని.. ఇప్పటికీ ఏం తేల్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతోందని విమర్శించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని తెలిపారు. కాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. […]
Road Extend Works: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 10 జేసీబీలతో అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా దీంతో పోలీసులు […]
Hyderabad: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. […]
Telangana Cabinet Held Today: తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి […]
Ponguleti on Telangana Sarpanch Elections: ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేపు జరిగే కేబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. అయితే, ఎన్నికలకు మరో 15 రోజులకే సమయం ఉండడంతో కాంగ్రెస్ నాయకులు సిద్దంగా […]
Electric Wires Cut Down in Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం నెలకొంది. చింతల్ కుంట ఏరియాలో ఇవాళ తెల్లవారుజామున హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనమయ్యారు. అక్కడే నిద్రిస్తున్న ఓ శునకం కూడా కాలి బూడిదైంది. కాగా చింతల్ కుంట ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఈక్రమంలోనే వారిపై హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగి వారిపై పడిపోయాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. […]