Home / Telangana
Heavy rains in Telangana and Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్లో అంబర్ పేట, తెల్లాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, హఫీజ్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎస్.ఆర్. నగర్, […]
MMTS Woman Case Train Incident: హైదరాబాద్లోని సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించగా.. యువతి రైలు నుంచి దూకేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసలు ఆ యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఓ […]
CM Revanth Reddy : పండుగ నాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రాణాలు కాపాడారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడగా, సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. విశాఖకు చెందిన హేమంత్ (22) అనే యువకుడు మార్చి 29న షిర్డీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారగా, కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రైవేట్ […]
TG EAPCET 2025 : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ 2025 పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి మే 2 నుంచి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈఏపీసెట్ పరీక్షలు రోజూ రెండు దశల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 […]
BRS Working President KTR : కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ప్రధానికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాలని కోరారు. ఆ 400 ఎకరాల భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సెంట్రల్ […]
Liquor Prices Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్. త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే బీర్లపై 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. త్వరలోనే అన్నింటిపై ధరలు పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ప్రధానంగా రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం మద్యం ధరలు […]
Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ లేఔట్లో సహస్ర మహేష్ అపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన […]
Telangana High Court big shock to TGPSC Key Orders On Group-1 Recruitments: టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాలను నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రూప్-1 నియామకాల విషయంలో విచారణ ముగిసే వరకు గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకూడదని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలెక్ట […]
Hyderabad Metro : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసి పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండషన్ తన పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలను నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు […]
Hyderabad Metro charges Hike: హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్. త్వరలోనే మెట్రో ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ నష్టాల్లో కొనసాగుతోందని, మెట్రో నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో రైలు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఛార్జీలు పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర పెంచాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని సమాచారం. హైదరాబాద్ మెట్రో రైలు 2017 నుంచి ఈ ఏడాది ఆర్థిక […]