Home / Telangana
Miss England Milla Magee withdraws from competition : హైదరాబాద్లో జరుగుతోన్న 72వ ప్రపంచ సుందరీమణుల పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ -2025 మిల్లా మాగీ వైదొలిగింది. దీంతో మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటీష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్ ఇంగ్లాండ్ మాగీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ […]
Hyderabad Rains : హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నాంపల్లి, లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, యూసుఫ్గూడ, అమీర్పేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, సనత్నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనగూడ, చందానగర్లో భారీగా వర్షం కురుస్తున్నది. లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలితోపాటు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, మారేడ్పల్లి, తిరుమలగిరి […]
CM Revanth Reddy spoke to PM Modi : కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు జోన్లుగా తెలంగాణకు విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 2047 నాటికి పరిశ్రమలు, ఇన్ఫ్రా రంగంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెడతామన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్తో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్లో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని […]
Telangana objects to Polavaram project dead storage : పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ గోదావరి బోర్డుతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పీపీఏలో పోలవరం చీఫ్ ఇంజినీర్ తెలిపారు. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో […]
Film Industry: తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండబోదని స్పష్టమైంది. ఈ మేరకు సినీ నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సినీ వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. పరిశ్రమలోని సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మే 30 నుంచి ఈ కమిటీ వరుస సమావేశాలు […]
Kerala: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి. ప్రతి ఏటా జూన్ 1 తర్వాత వచ్చే రుతుపవనాలు ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణశాఖ తెలిపింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఇంత త్వరగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అరేబియా […]
BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖపై తెలంగాణ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ సంద్భంగా సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఉందని, ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండటం తెలంగాణకు అవమానమని చెప్పారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని అన్నారు. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ కు […]
MLC Kavitha Response on Letter Which is Sent to KCR: మా నాయకుడు కేసీఆరేనని, ఆయన నాయకత్వలోనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వరంగల్లో జరిగిన సభ తర్వాత రెండు వారాల క్రితం తన తండ్రి, […]
Uttam Kumar Reddy fires on BRS: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు ఉన్నట్లు తేల్చడానికి దేశంలోనే పేరుగాంచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వగానే కమిషన్ తప్పుబడుతూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇందిరా గాంధీ లాంటి […]
First Covid-19 Case in Telangana: యావత్ ప్రపంచాన్ని వైరస్తో వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో నాలుగు రోజులుగా అక్కడక్కడ కరోనా మాట వినిపిస్తున్నది. తాజాగా తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలోని విశాఖపట్నంలో కొవిడ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా […]