Published On:

Telangana: భారీగా మావోల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

Telangana: భారీగా మావోల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు పలు హోదాల్లో పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు.

 

అయితే లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున నగదు అందజేశారు. అలాగే వారిపై ఉన్న రివార్డులను కూడా 24 గంటల్లో వారి అకౌంట్లలో జమచేస్తామని ఎస్పీ చెప్పారు. వారికి అన్ని రకాల పునరావాసాలు కల్పిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా అజ్ఞాతంలో ఉంటున్న మావోలు జనజీవనంలో కలవాలని పోలీసులు కోరారు.

 

కాగా ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ- ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.  ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో దాదాపు 31 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నారు. పలువురు జవాన్లు కూడా మరణించారు.