Published On:

Sridhar Babu : మంత్రి శ్రీధర్‌ బాబుకు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

Sridhar Babu : మంత్రి శ్రీధర్‌ బాబుకు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

Big relief for Minister Sridhar Babu : కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ అంశంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతోపాటు 13 మందిపై కేసు నమోదైంది. ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017లో శ్రీధర్‌బాబు సహా పలువురు కాంగ్రెస్‌ నేతలపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కేసును కోర్టు కొట్టివేసిన అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతుల తరఫున పోరాడితే కేసులు పెట్టారని, చివరికి న్యాయమే గెలిచిందన్నారు.

 

కాళేశ్వరానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడేందుకు వినతిపత్రాన్ని ఇవ్వాలని వెళ్లినట్లు తెలిపారు. అధికారం అండతో తమపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని చెప్పారు. కోర్టులో ఎనిమిదేళ్లపాటు కేసు నడిచిందన్నారు. తాజాగా కోర్టు కేసును కొట్టివేసిందని తెలిపారు. ఇది ప్రజా విజయమని సంతోషం వ్యక్తం చేశారు. రైతుల విజయంగా పేర్కొన్నారు. పేద రైతు ఘోషను కోర్టు విన్నదని చెప్పారు. అధికారం ఉందని కేసులు పెట్టారని తెలిపారు.

 

పోలీసులను అడ్డగోలుగా వినియోగించుకున్నారని ఆరోపించారు. కానీ, ఇవాళ ప్రజాస్వామ్యం ఉందని, చట్టాలను నమ్ముతూ తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తమకు అధికారం ఉందని ఎక్కడా దుర్వినియోగం చేయడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూడా నిలవలేదన్నారు. దానిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: