Congress: మంత్రివర్గ విస్తరణ అప్పుడే.. పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

Telangana: మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణ గురించి వస్తున్న ప్రచారంపై స్పందించారు. కాగా తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 12 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మిగిలిన 6 స్థానాలను భర్తీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రయత్నాలు చేసింది. అయినా ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక ఆ ప్రయత్నాలను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడూ మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే సీఎం రేవంత్ రెడ్డిని మార్చుతారనే బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమని తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఐదేళ్లు పాలన చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక మంత్రివర్గ విస్తరణ మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో ఉండే అవకాశం ఉందని తెలిపారు. మంత్రివర్గంలో ఎలాంటి బేదాభిప్రాయాలులేవని కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే వారిపై సైబర్ క్రైమ్ లో కేసు పెడతామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మే 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.