Published On:

Tornado: అమెరికాను వణికించిన టోర్నడో.. 21 మంది మృతి

Tornado: అమెరికాను వణికించిన టోర్నడో.. 21 మంది మృతి

USA: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. సెంట్రల్ అమెరికాలోని మిస్సౌరీ, కెంటకీ రాష్ట్రాల్లో తుపాను, టోర్నడో బీభత్సానికి 21 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. కేవలం కెంటకీ రాష్ట్రంలోనే 14 మంది చనిపోయినట్టు రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ ప్రకటించారు. లారెల్ కౌంటీలో నిన్న రాత్రి 11.49 గంటలకు టోర్నడో వచ్చినట్టు స్థానికులు తెలిపారు.

 

కాగా టోర్నడో ప్రభావానికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. తప్పినపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. టోర్నడో బీభత్సానికి ఇళ్లు, పలు భవనాలు కూలిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

మరోవైపు మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ లో నిన్న తుపాను బీభత్సం సృష్టించడంతో ఐదుగురు మృతిచెందారు. సెయింట్ లూయిస్ ఫైర్ చీఫ్ డెన్నిస్ జెంకర్సన్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తుపాను నగరంలోని 20 చదరపు బ్లాక్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. 5వేల కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయని మేయర్ కారా స్పెన్సర్ తెలిపారు.

 

అయితే అమెరికాలో టోర్నడోలు రావడం సహజమే.. కాగా గతంలోనూ పెద్ద ఎత్తున్న టోర్నడోలు దేశంలో బీభత్సం సృష్టించాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తాయి. తాజాగా నిన్న సంభవించిన టోర్నడోతో పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి.