Published On:

Hyderabad: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అనాథ పిల్లలకు కూడా

Hyderabad: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అనాథ పిల్లలకు కూడా

Rajiv Aarogyasri: రాష్ట్రంలో పేదలు ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు వీలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద రూ. 10 లక్షల వరకు వైద్యసాయం అందనుంది. అలాగే పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలోనే రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా వారికి ఈ సదుపాయం కలుగుతోంది. కాగా పథకం అమలును ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే పథకం అమలు గురించి కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఇప్పటివరకు నిరుపేద కుటుంబాలకే అమలైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తాజాగా తల్లిదండ్రులు, బంధువులు లేని అనాథ పిల్లలకు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రిజిస్టర్డ్ చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూషన్స్ లో నివసిస్తున్న 2215 మంజి అనాథ పిల్లలను రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేతులమీదుగా చిన్నారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.

 

సాధారణంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు కావాలంటే కొన్ని గుర్తింపు కార్డులను అందించాల్సి ఉంటుంది. కానీ అనాథ పిల్లల వద్ద అందుకు సంబంధించిన వివరాలు లేకపోవడంతో ఇప్పటివరకు వీరికి పథకం వర్తించలేదు. అయితే వీరు అనారోగ్యం బారిన పడినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో అనాథ పిల్లల పేరున ఆరోగ్య శ్రీ కార్డులను అందజేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 2215 మందికి ఇవాళ కార్డులు అందించారు.

 

అనంతరం హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని సీసీఐలలో ఉన్న 2215 మంది పిల్లలలో 641 మంది అనాథలు, 1103 మంది సెమీ- అనాథలు, 471 మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారని తెలిపారు. వారంతా అనారోగ్యానికి గురైనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నా.. ప్రైవేట్, కార్పొరేట్ వైద్యం అందితే వేగంగా కోలుకుంటారని అందుకే రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులు అందించామన్నారు.