High Court : తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ : కొలీజియం నిర్ణయం

High Court : తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగాయి. 7గురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టుకు చెందిన 4గురు న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీకి చెందిన న్యాయమూర్తి ఒకరు ఉన్నారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆమోదం తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన కొలీజియం సమావేశాల్లో నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ హేమంత్ చందన్గౌడర్ కర్ణాటక హైకోర్టు నుంచి మద్రాస్కు బదిలీ కోరగా, కొలీజియం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ నటరాజన్ కేరళకు కోరగా, ఓకే చెప్పింది. జస్టిస్ నెరనహళ్లి శ్రీనివాస్ సంజయ్ గౌడను గుజరాత్కు బదిలీ చేసింది. జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద్ను ఒడిశా హైకోర్టుకు బదిలీ చేసింది. వీరితోపాటు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. శ్రీసుధను కర్ణాటకకు బదిలీ చేసింది. జస్టిస్ కాసోజు సురేందర్ను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావును కర్ణాటకకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.