Home / high court
Telangana High Court : భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 24న న్యాయస్థానం విచారణ చేపట్టింది. మొత్తం 27 మంది అధికారులకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. జస్టిస్ భాస్కర్రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ మంగళవారం కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో మహేశ్భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా […]
Telangana High Court : 2024 లోక్సభ ఎన్నికల్లో రేవంత్రెడ్డి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని వ్యాఖ్యానించాడు. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నమోదైంది. కేసును కొట్టేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తుదితీర్పు వెలువడే వరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని […]
High Court : తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగాయి. 7గురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టుకు చెందిన 4గురు న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీకి చెందిన న్యాయమూర్తి ఒకరు ఉన్నారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆమోదం […]
Hyderabad Metro : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసి పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండషన్ తన పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలను నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు […]
Sensational Verdict on Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇందులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 5 మంది నిందితులకు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేసింది. 45 రోజులపాటు హైకోర్టు […]
Verdict out tomorrow on Dilsukhnagar Bomb Blasts Case: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్ల ఘటనలనో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలయ్యాయి. కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్ట్రాక్ కోర్టు మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్పాటు ఐదుగురికి మరణశిక్ష విధించింది. శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతం దిల్సుఖ్నగర్లో […]
HCU Land Dispute Case postponed to 24th April 2025 by High Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. హై కోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. భూ వివాదం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. కేసులో కౌంటర్, రిపోర్టు ఈ నెల 24లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యూనివర్సిటీ భూముల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ […]
Group-1 Candidates : గ్రూప్-1 అభ్యర్థులు ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ వేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జక్టులు ఉంటే, 12 సబ్జక్టుల నిపుణులతోనే దిద్దించారని పేర్కొన్నారు. మూడు భాషల్లో పరీక్ష జరిగినా మంచి నిపుణులతో దిద్దించలేదని వెల్లడించారు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో రెండు భాషల (తెలుగు, ఇంగ్లిష్) పేపర్లు దిద్దించచారని, దీంతో మూల్యాంకణంలో నాణ్యత […]
Telangana High Court : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించిన ఓ పిటిషనర్కు రూ.కోటి ఫైన్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఓ కేసు హైకోర్టు వద్ద పెండింగ్లో ఉంది. కాగా, విషయాన్ని దాచిన పిటిషనర్ మరో బెంచ్ వద్ద కొత్త పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకున్నాడు. విషయం కోర్టు దృష్టికి రావడంతో జస్టిస్ నగేశ్ ఆగ్ర వ్యక్తం […]
High Court Reserves on KCR, Harish Rao’s Plea in Medigadda Case: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి నాసిరకమైన నిర్మాణంతోపాటు సరైన డిజైన్ లేకపోవడమే కారణమంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి భూపాలపల్లి లోయర్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ […]