Home / Andhrapradesh
New Creature in Found in Seshachalam Reserve Forest: తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్లోని జీవావరణంలో అరుదైన కొత్త జీవిని కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జాతి స్కింక్ (నలికిరి)ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. అరుదైన జీవికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్గా పేరు పెట్టారు. పాక్షిక పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలి ఉంటుంది. కొత్త జాతి ప్రస్తుతం […]
Education Minister Nara Lokesh : రాష్ట్రంలోని 80 శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు విద్యార్థులకు అందించామన్నారు. మిగిలిన 20శాతం మందికి ఈ నెల 20లోగా అందిస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామన్నారు. కొందరి ఖాతాలు యాక్టివ్ లేక నిధులు తిరిగి వచ్చాయని, ఆయా ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామన్నారు. ఖాతాలు […]
Award for Kuppadam Saree : చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతోపాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ ఓడీపీ-2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరిలో బాపట్ల కేంద్ర బృందం సభ్యులు విచ్చేశారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతంలో మగ్గాలపై నేతనేసే కుప్పడం చీరలను పరిశీలించారు. అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్లు […]
‘First step in good governance’ postponed : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి సర్కారు గురువారం సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో ఉత్సవం నిర్వహించాలని […]
Talli Ki Vandanam scheme : తల్లులకు ఏపీ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకం అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గురువారం తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం కింద నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. రేపే నిధులు విడుదల కానున్నాయి. ఏపీలో మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం […]
CM Chandrababu Naidu review : గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపారు. 100 శాతం మార్పు కనిపించాలని ఆదేశించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా సీఎం తెలుసుకున్నారు. కేసుల్లో నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ పూర్తి చేసి […]
AP PCC President YS Sharmila : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అమరావతి మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందని తెలిపారు. సజ్జల కుమారుడు భార్గవ్రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనపై కూడా దుష్ప్రచారం చేశారని […]
Kommineni Srinivasa Rao remanded for 14 days : రాజధాని మహిళలపై కొమ్మినేని శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో శ్రీనివాసరావుతోపాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు నిందితుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సాక్షి టీవీలో శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో […]
Home Minister Anita : ఏపీ రాజధాని అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైసీపీ నాయకుల మాటలు ఏపీ గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి అంటేనే జగన్కు అక్కసు అని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అమరావతిని నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు. రాజధాని అమరావతి సాధన […]
Andhra Cricket Association President and Vijayawada MP Kesineni Chinni : రాజధాని అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంపై కూటమి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతిలో అత్యుత్తమ వసతులతో స్టేడియం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. త్వరలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు స్థలం రాగానే నిర్మాణం చేపడుతామన్నారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ […]