Last Updated:

Janasena Formation Day: ఒంటరి పోరుకు సిద్ధం.. తెదేపాతో జనసేన పొత్తు లేనట్లేనా?

Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.

Janasena Formation Day: ఒంటరి పోరుకు సిద్ధం.. తెదేపాతో జనసేన పొత్తు లేనట్లేనా?

Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.

టీడీపితో పొత్తు.. పవన్ క్లారిటీ (Janasena Formation Day)

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజలు అండగా ఉంటారనే న మ్మకం భరోసా వస్తే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దమని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ఒంటరిగా గెలుస్తుందని.. క్షేత్రస్థాయి రిపోర్టులు వస్తే.. ఒంటరి పోరుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో పరోక్షంగా తాను ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని పవన్ తేల్చేశారు. తాను వస్తే.. పూలమాలలు, గజమాలలు వేయడం కాదు.. తనకు ఓట్లు వేయండని ప్రజలకు పిలుపు నిచ్చారు. తన కోసం గుండెలు బాదుకోవడం కాదు… గుండెల్లో పెట్టుకొని ఒటేయండి చాలని అన్నారు.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణాన్ని పవన్ ఈ సందర్భంగా వివరించారు. బీజేపీ అంటే మోడీ ఒక్కరే అప్పట్లో తనకు తెలుసన్నారు.

తనకు పెద్దగా ఇతర నాయకులు ఎవరూ తెలియదన్నారు. మోడీ దేశానికి అవసరమైన నాయకుడు అని.. ఆయనకు మద్దతు ఇచ్చానన్నారు.

మోడీని తాను సపోర్ట్ చేయగానే చాలామంది తనను వెటకారించారన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితో.. తూట్లు పొడిచేశారన్నారు. ఆయనను ఎదురించి చాలా నష్టపోయానన్నారు. ఏపీ యువత కులాల కుట్రలో ఇరుక్కుపోయారన్నారు. తెలంగాణలో తామంతా ఒక్కటే అనే భావన ఉంటుంది. అది ఏపీలో కనిపించడం లేదన్నారు. ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరూ నన్ను ఓడిపించేశారన్నారు పవన్.అయినా కూడా తాను చచ్చినా ధర్మాన్ని పట్టుకొనే కూర్చుంటానన్నారు పవన్ కళ్యాన్.

ఈ సారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాదని.. పార్టీతో ఎలాంటి ప్రయోగాలు చేయనన్నారు. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే.. తన ప్రణాళిక ఉంటుందన్నారు.

కులం కాదు.. గుణం చూసి ఓటేయ్యండి..

రాష్ట్రంలో చదువుకున్న యువత ఓటు విషయంలో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో కులం చూసి కాకుండా గుణం చూసి ఓటు వేయాలని యువతకు పిలుపునిచ్చారు.

తనకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు. ఓటు వేసే సమయంలో మా కులపోడు అని చూడకుండా.. అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓటు క్రీయశీల పాత్ర పోషించనుందని.. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.

జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం

వైసీపీ పాలనకు చరమగీతం పాడి.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇప్పటి వరకు ఎన్ని మాటలన్న.. ఓర్పుతో సహించామని ఇక అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించారు.

ప్రజలకు అండగా ఉండాలంటే.. ధర్మాన్ని కాపాడాలని జనసేన ధర్మాన్ని రక్షిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ అవినీతిపై ప్రజల్లో తిరుగులేని పోరాటం చేస్తామన్నారు.

అసమానతలు, దోపిడీ విధానాలకు ఎదురు తిరగడానికి, పేద వర్గాలకు అండగా నిలబడడానికి జనసేన అండగా ఉంటుందని సూచించారు.

రెండు చోట్ల ఓడిపోయిన.. పార్టీని నడిపే శక్తిని తనకిచ్చారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. ఒక్కడిగా ప్రారంభించిన జనసేన.. లక్షల మంది కార్యకర్తలను సంపాదించుకుందని తెలిపారు.