Published On:

Pawan Kalyan: కుక్కలు అరిచినట్లు అరవద్దు.. సెలబ్రిటీలకు పవన్ మాస్ వార్నింగ్

Pawan Kalyan: కుక్కలు అరిచినట్లు అరవద్దు.. సెలబ్రిటీలకు పవన్ మాస్ వార్నింగ్

Pawan Kalyan:పాకిస్థాన్ చేసిన పహాల్గమ్ దాడికి భారత్ రివెంజ్ తీర్చుకుంది. సింధూర్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించి ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కరిపించింది.  దాదాపు 9 స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించి విజయవంతం అయ్యారు. దీంతో ఈరోజు ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది.  పహాల్గమ్ దాడికి పర్ఫెక్ట్ రివెంజ్ అంటూ భారతీయులు ఆర్మీని ప్రశంసిస్తున్నారు. ఇంకోపక్క ఈ దాడికి అనుమతి ఇచ్చిన ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

ఉదయం లేచిన వెంటనే అందరికీ ఈ సింధూర్ దాడి గురించి తెలియడంతో.. అందరు మంచి ఉదయం అని చెప్పుకొస్తున్నారు.  ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఆర్మీకి తామంతా అండగా ఉన్నామని తెలుపుతూ.. మరోసారి దేశ భక్తిని చాటుకుంటున్నారు. ప్రధాని మోడీ చేసిన పని చాలా మంచిది అంటూ కొనియాడుతున్నారు.

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ దాడిపై ప్రశంసలు కురిపించారు. ఇండియన్స్ ను చంపిన ఏ ఒక్క ఉగ్రవాదిని ప్రధాని వదిలిపెట్టరని చెప్పుకొచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్  సభలో మాట్లాడుతూ.. ఈ దాడి గురించి మాట్లాడారు. పహాల్గమ్ ఘటనకు యావత్ భారతదేశం రివెంజ్ తీర్చుకోవాలని ఎదురుచూసారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ప్రధాని మోడీ నాయకత్వంలో రక్షణ దళాలు పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను కూల్చివేశాయి.

 

ఇక ఈ దాడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా.. సహించేది లేదు. ముఖ్యంగా సెలబ్రటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు జాగ్రత్తగా ఉండాలి. భారత్ ఆర్మీ గురించి కానీ,  భారత్ గురించి కానీ తప్పుడు పోస్టులు పెట్టినా.. వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుక్కలు అరిచినట్లు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదు” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.