Home / Pawan Kalyan
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
మంగళగికి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం పలువరు నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతారని సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ తో ఆయన చర్చలు జరిపారు. కొణతాల త్వరలోనే మంచిరో్జు చూసుకుని జనసేన పార్టీలో చేరనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు, అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు. తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కలిసిన తరువాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తమ భేటీపై స్పష్టతనిస్తూ ట్వీట్ చేశారు. ఎపి ప్రజలకి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చి వైసిపిలో చేరానని అంబటి రాయుడు తెలిపారు. తన ఆశలు, ఆశయాలు ఫలిస్తాయని అనుకున్నానని అంబటి రాయుడు చెప్పారు.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మంగళగిరి జననసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించడానికి.. ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యం జనసేనానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. డిసెంబర్ 14న ఈ మేరకు పవన్ కళ్యాణ్కి ఓ లేఖని రాశారు. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్ కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు