Published On:

Operation Sindoor: మేమంత ఆర్మీతోనే ఉన్నాం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినీ ప్రముఖుల స్పందన

Operation Sindoor: మేమంత ఆర్మీతోనే ఉన్నాం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినీ ప్రముఖుల స్పందన

Chiranjeevi pawan kalyan and Other Celebs React on Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్‌ దీటైన సమాధానం ఇచ్చింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్‌ ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ ఫోర్స్‌ మెరుపులు దాడులు చేసింది. ఈ దాడి సుమారు 100 మందిపైగా ఉగ్రవాదాలు మరణించినట్టు సమాచారం. తెల్లావారేసరికి పహల్గాం బాధితులకు ఆపరేషన్‌ సిందూర్‌తో న్యాయం జరిగిందని, ఇది అసలైన జస్టీస్‌ అంటూ అంతా ఇండియన్‌ ఆర్మికి మద్దతు తెలుపుతున్నారు.

 

పాక్‌పై భారత్‌ భద్రత బలగాల చర్యపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు దీనిపై స్పందిస్తూ ఇండియన్‌ ఆర్మీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో పాటు పలువురు హీరోలు ఎక్స్‌ వేదికగా ట్విట్‌ చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌.. జై హింద్‌’, ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌తో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమవ్వం ఆనందంగా ఉంది. జై హింద్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

అలాగే డిప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేస్తూ.. “ఎన్నో రోజుల నిశ్శబ్ధం తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారతదేశంలో మొత్తంలో స్ఫూర్తిని నింపింది. త్రివిధ దళాల ధైర్యం, అలాగే ఈ ఆపరేషన్‌ నాయకత్వం వహించి సైన్యానికి అండగ ఉన్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మేమంతా మీతోనే ఉన్నాం” అని పేర్కొన్నారు.

‘పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్‌’ అని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ భారత సైన్యాన్ని కొనియాడారు.

‘మా ప్రార్థనలు మా ఆర్మితోనే ఉంటాయి.. ఒకే దేశం.. కలిసి నిలబడాతాము’ – అంటూ దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగమైన మన భారత సైన్యం భద్రత, బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జై హింద్‌ – జూనియర్‌ ఎన్టీఆర్‌

న్యాయం జరిగింది.. జైహింద్‌.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ – అల్లు అర్జున్‌