Last Updated:

Amit Shah: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసింది.. అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేత కార్మికులను ఆదుకునేందుకు మక్తల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆరోపించారు.

Amit Shah: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసింది..  అమిత్ షా

 Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేత కార్మికులను ఆదుకునేందుకు మక్తల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం..( Amit Shah)

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్‌), ఆయన తనయుడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఆయన మంత్రివర్గం సహచరులు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి తెలివిగా ఓటు వేయాలని అమిత్ షా ప్రజలను కోరారు. తెలంగాణలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అనేక భూకబ్జా కార్యక్రమాలు జరిగాయి. 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అమిత్ షా అన్నారు. రెండు పార్టీల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం వల్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు వేసిన ఓట్లు బీఆర్‌ఎస్‌కే పడతాయని అమిత్ షా హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు, రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ రహస్యంగా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ గెలిపించడం ఒక్కటే మార్గమని అమిత్ షా అన్నారు. తెలంగాణలో వెనుకబడిన కులాల (బీసీలు) నుంచి బీజేపీ ముఖ్యమంత్రిని నియమిస్తుందని తెలిపారు. మాదిగ కులానికి సమానంగా కోటా కల్పిస్తాం. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు దశలవారీగా ఎత్తివేస్తాం, ఎస్సీ వర్గాలకు మరిన్ని రిజర్వేషన్లు వస్తాయి. తెలంగాణలోని మహిళలకు ప్రతి సంవత్సరం ఉచితంగా నాలుగు సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మత్స్యకారుల సంక్షేమానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.

రజాకార్లకు భయపడి కేసీఆర్ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని అమిత్ షా విమర్శించారు. అంబాసిడర్ కారు యొక్క స్టీరింగ్‌ను మజ్లిస్ నియంత్రిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర వేడుకగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ రామాలయానికి శంకుస్థాపన చేస్తారని అమిత్ షా అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అయోధ్యలోని రామ మందిరానికి ఉచితంగా తీర్థయాత్ర కు తీసుకువెడతామని అమిత్ షా చెప్పారు. అంతకుమందు ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనులను నిర్ల్యక్ష్యం చేసారని ఆరోపించారు. గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారని అన్నారు. అదేవిధంగా సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించినట్లు తెలిపారు.