Home / latest Telangana news
Telangana Secretariat : హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సచివాలయ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, డ్రోన్ ఎగరేసిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వంశీ, నాగరాజు అనే ఇద్దరి వ్యక్తులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సచివాలయ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు […]
SLBC : నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో గల్లంతైన 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కార్మికుల జాడ కోసం 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో కూలీల ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో గుర్తించిన ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని […]
TG High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ధర్మాసనం కొట్టివేసింది. భూసేకరణపై వెంటనే స్టే విధిస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లోని భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొన్న మొత్తం 8 ఎకరాలపై కోర్టు అభ్యతరం వ్యక్తం చేసి స్టే ఇచ్చింది. కాంగ్రెస్ […]
Graduate MLC Elections : రాష్ట్రంలో కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. మూడు రోజులపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. ఈ క్రమంలోనే విజయం దోబూచులాడి చివరకు బీజేపీ అభ్యర్థిని వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ఆధిక్యంలో నిలువగా, 78,635 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి 73,644 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో నరేందర్రెడ్డి […]
Telangana CM Revanth Reddy lays foundation stone for : హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టే ఈ ఆస్పత్రిలో 30 డిపార్ట్మెంట్లు ఉండనున్నాయని, ఇందులో రోబోటిక్ సర్జరీలు చేసేలా నిర్మించనున్నారు. మొత్తం 8 బ్లాక్లు, 2వేల పడకలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తుండగా.. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
BJP Preparing For Upcoming MLC Elections In Telangana: తెలంగాణపై కమలదళం కన్నేసిందా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో చూపించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా..? రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నిక అయినా…కమలం పార్టీ గెలవాల్సిందే అన్న వ్యూహంతో పార్టీ అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఇంతకీ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ […]
Police Notice to Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు లోపలికి తీసుకువెళ్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సోమవారం చిక్కడపల్లి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు(డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందిన నేపథ్యంలో అల్లు అర్జున్ మంగళవారం ఉదయంపోలీసుల విచారణకు హాజరు అయ్యారు. అల్లు […]
KTR Gets Interim Protection from Arrest: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో తనని అరెస్ట్ చేయకుండ పోలీసులకు ఆదేశాలని ఇవ్వాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పటిషన్ దాఖలు చేశారు. ఇవాళ (డిసెంబర్ 20) లంచ్ మోషన్ పటిషన్ వేయగా తాజాగా న్యాయస్థానం విచారించింది. 10 రోజుల వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని […]
KTR Tweet On Allu Arjun Arrest: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రత్యక్ష ప్రమేయం లేని కేసులో ప్రత్యేక్షంగా ప్రమేయం లేని నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ప్రభుత్వ అభద్రతకు పరాకాష్టాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ షేర్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బాధితులకు పూర్తిగా సానుభూతి తెలిపారు. కానీ ఘటనలో […]
Manda Krishna Madiga: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ తన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని అన్నారు. దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక […]