Published On:

Amit Shah : 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం : అమిత్‌ షా

Amit Shah : 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం : అమిత్‌ షా

Amit Shah : 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గినట్లు వెల్లడించారు. నక్సల్‌ రహిత భారత్‌ను నిర్మించే దిశగా మరో మైలు రాయిని చేరుకున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కొన్ని రోజులుగా వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై అమిత్‌ షా తాజాగా స్పందించారు.

 

 

 

ఎన్డీయే కఠినమైన నిర్ణయం..
దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఎన్డీయే సర్కారు కఠినమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని, ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామన్నారు. నేడు ఇండియాలో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గాయని చెప్పారు. తద్వారా కొత్త మైలురాయిని సాధించామని కొనియాడారు. మోదీ ప్రభుత్వం నక్సలిజం పట్ల కఠినమైన విధానాన్ని అవలంభిస్తోందన్నారు.

 

 

 

6కు చేరిన నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు..
హోంమంత్రిత్వ శాఖ రూపొందించి నివేదించిన లెక్కలు ఈ విధంగా ఉన్నాయి… దేశంలో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం 2015లో 35 ఉండగా, 2018 నాటికి 30కి తగ్గాయి. 2021నాటికి 25కు వచ్చాయి. తాజాగా వాటి సంఖ్య 6కు చేరింది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించేందుకు అమిత్‌ షా ఈ నెల 4, 5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌ కార్యకలాపాలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 7, 8 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు సదరు వర్గాలను ఊటంకిస్తూ పీటీఐ నివేదించింది.

ఇవి కూడా చదవండి: