Last Updated:

Vande Bharat trains: ముంబై నుంచి రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు

Vande Bharat trains: ముంబై నుంచి రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Vande Bharat trains:ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మొదట CSMT-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు, తర్వాత CSMT-సాయినగర్ షిర్డీ రైలును ప్రారంభించారు.

ఒక రాష్ట్రానికి రెండు వందేభారత్ రైళ్లు..

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మహారాష్ట్రకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని, ఒక రాష్ట్రానికి రెండు వందేభారత్ రైళ్లు రావడం ఇదే తొలిసారి అని అన్నారు.కొత్త రైళ్లు ముంబై మరియు పూణే వంటి ఆర్థిక కేంద్రాలను మా భక్తి కేంద్రాలకు అనుసంధానం చేస్తాయి. ఇది కళాశాలలకు మరియు కార్యాలయాలకు వెళ్లే ప్రజలు, రైతులు మరియు భక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది,” అన్నారాయన.ఒకప్పుడు పార్లమెంట్‌ సభ్యులు తమ నియోజకవర్గాల్లో రైళ్లను ఆపాలని కోరేవారు. కాని ఇప్పుడు వందేభారత్‌ రైలును డిమాండ్‌ చేయడం ప్రగతిశీల భారతదేశ చిత్రాన్ని చూపుతుందని ఆయన అన్నారు.వందే భారత్ రైలు నేటి ఆధునిక భారతదేశానికి అద్భుతమైన చిత్రం. ఇది భారతదేశం యొక్క వేగం మరియు స్థాయికి ప్రతిబింబం. దేశం వందే భారత్‌ను ప్రారంభించిన వేగాన్ని మీరు చూడవచ్చు. ఇప్పటి వరకు 10 రైళ్లను ప్రారంభించామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీ ముంబైలో దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన ఒక విద్యా సంస్థ యొక్క కొత్త క్యాంపస్‌తో పాటు రెండు ఎలివేటెడ్ రోడ్ కారిడార్లు మరియు ఒక అండర్‌పాస్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

ముంబై-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశేషాలివే..

 

ముంబై-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 455 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది.
ఇది ముంబయ్_షోలాపూర్ మధ్య ప్రస్తుత ప్రయాణసమయంలో ఒక గంట ఆదా చేస్తుంది.
ఇది రెండు నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది .
ఇది షోలాపూర్‌లోని సిద్ధేశ్వర్, అక్కల్‌కోట్, తుల్జాపూర్, షోలాపూర్ సమీపంలోని పంఢర్‌పూర్ మరియు పూణే జిల్లాలోని అలండి వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
క్యాటరింగ్ సర్వీస్ లేకుండా వన్-వే ఛార్జీ చైర్ కార్‌కు రూ. 1,000 మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌కు రూ. 2,015 టిక్కెట్ ధర నిర్ణయించారు.
క్యాటరింగ్‌తో కూడిన రెండు తరగతులకు ఛార్జీలు వరుసగా రూ. 1,300 మరియు రూ. 2,365.
ఈ రైలు CSMT నుంచి సాయంత్రం 4.05 గంటలకు బయలుదేరి రాత్రి 10.40 గంటలకు షోలాపూర్ చేరుకుంటుంది.
షోలాపూర్ నుంచి ఉదయం 6.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు CSMT చేరుకుంటుంది.
రైలు బుధవారం CSMT నుండి మరియు గురువారం షోలాపూర్ నుండి నడవదు.

ముంబై-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశేషాలు..

ముంబై-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 343 కిలోమీటర్లు ప్రయాణానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది.
ఈ రైలు ముంబై నుండి సాయినగర్ షిర్డీ మధ్య ప్రస్తుత ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటలు తగ్గిస్తుంది.
ఇది నాసిక్, త్రయంబకేశ్వర్ మరియు శని సింగనాపూర్‌లోని ఇతర యాత్రా కేంద్రాలను కూడా కలుపుతుంది.
క్యాటరింగ్ సర్వీస్ లేకుండా వన్‌వే ఛార్జీ చైర్ కార్‌కు రూ.840 మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌కు రూ.1,670గా టిక్కెట్ ధర ఉంటుంది.
క్యాటరింగ్‌తో కూడిన రెండు తరగతులకు ఛార్జీలు వరుసగా రూ. 975 మరియు రూ. 1,840.
CSMT-సాయినగర్ షిర్డీ సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

ఇవి కూడా చదవండి: