Uppal Former MLA: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కన్నుమూత.. సీఎం దిగ్భ్రాంతి

Uppal Bandari Raji Reddy passes away: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందారు. కాగా, 2009లో కాంగ్రెస్ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయన 2014 వరకు పనిచేశారు. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి రాజిరెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.