Last Updated:

Ajit Doval : ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుగాంచిన “అజిత్ దోవల్” ఎవరు? అతని ప్రత్యేకత ఏమిటి?

భారతదేశపు అత్యంత విజయవంతమయిన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్..ఈ మాటను అధికార, విపక్ష నాయకులందరూ ఒప్పుకుంటారు. నేడు దోవల్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు సంబంధించిన విశేషాలు ఇవి.

Ajit Doval : ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుగాంచిన “అజిత్ దోవల్” ఎవరు? అతని ప్రత్యేకత ఏమిటి?

Ajit Doval : భారతదేశపు అత్యంత విజయవంతమయిన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్..

ఈ మాటను అధికార, విపక్ష నాయకులందరూ ఒప్పుకుంటారు. నేడు దోవల్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు సంబంధించిన విశేషాలు ఇవి.

అజిత్ కుమార్ దోవల్ జనవరి 20, 1945న జన్మించారు .కేరళ కేడర్‌కు చెందిన దోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా తన పోలీసు వృత్తిని ప్రారంభించారు.

మిజోరం మరియు పంజాబ్‌లలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు

1999లో కాందహార్‌లో హైజాక్ చేయబడిన IC-814 నుండి ప్రయాణీకులను విడుదల చేయడంలో ముగ్గురు సంధానకర్తలలో ఒకరిగా కీలక పాత్ర పోషించారు.

అతను 1971 మరియు 1999 మధ్యకాలంలో కనీసం 15 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాల హైజాకింగ్‌లను విజయవంతంగా పరిష్కరించారు.

1984లో ఖలిస్తానీ ఖలిస్థానీ మిలిటెన్సీని ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కోసం నిఘాను సేకరించడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు.

1990లో దోవల్ కాశ్మీర్‌కు వెళ్లి హార్డ్‌కోర్ మిలిటెంట్లను ఒప్పించి, జమ్మూకాశ్మీర్ ఎన్నికలకు మార్గం సుగమం చేశారు.

కెరీర్ లో ఎక్కువభాగం ఇంటెలిజెన్స్ లోనే..

అజిత్ దోవల్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో యాక్టివ్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా గడిపారు.

2004-05 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఆపరేషన్ విభాగానికి అధిపతిగా ఒక దశాబ్దం గడిపిన తర్వాత డైరెక్టర్‌గా పనిచేశారు.

దోవల్ ఏడేళ్లపాటు పాకిస్థాన్‌లో రహస్య కార్యకర్తగా ఉంటూ చురుకైన తీవ్రవాద గ్రూపులపై నిఘా సేకరించినట్లు సమాచారం.

సీక్రెట్ ఏజెంట్‌గా ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఆరేళ్లపాటు పనిచేశారు.

నెల రోజులకే  సత్తా చూపిన దోవల్ (Ajit Doval)

ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే  అజిత్ దోవల్ కు కఠినమైన  ఆపరేషన్‌ అప్పగించారు.

మోసుల్‌ను ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకోవడంతో 46 మంది నర్సులు ఇరాక్‌లోని తిర్కిట్‌లోని ఆసుపత్రిలో చిక్కుకున్నారు.

దోవల్ జూన్ 25, 2014న ఇరాక్ వెళ్లారు. అక్కడ ఇరాక్ ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపినతర్వాత నర్సులు విడుదల చేయబడ్డారు.

సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్త..

2016లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ కూడా అతడి ఆలోచనలేనని నివేదికలు చెబుతున్నాయి.

2019 బాలాకోట్ వైమానిక దాడి మరియు ఆ తరువాత భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ మిలిటరీ పట్టుకున్న విషయం తెలిసిందే.

అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో అజిత్ దోవల్ చర్చలు జరిపి అభినందన్ విడుదల అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

మయన్మార్‌లోని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్‌కు వ్యతిరేకంగా అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్‌తో కలిసి సైనిక చర్యను కూడా దోవల్ ప్లాన్ చేశారు.

ఈ ఆపరేషన్‌లో భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న దాదాపు 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

కశ్మీర్ పై  దృష్టి .. పాక్ పై ప్రత్యేక వ్యూహం

కశ్మీర్‌ లో రాళ్లు రువ్వేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

దేశ వ్యతిరేకులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కశ్మీర్ లోయలో మెతక వైఖరి అవలంబించే ప్రసక్తే లేదని అన్నారు.

పాకిస్తాన్‌కు సంబంధించి భారత జాతీయ విధానంలో తన సిద్ధాంతపరమైన మార్పుకు కూడా దోవల్ కు క్రెడిట్ దక్కుతుంది.

భారతదేశం తన సొంత గడ్డపై మాత్రమే కాకుండా విదేశీ గడ్డపై కూడా పోరాడుతుందన్నారు.

2019లో దోవల్‌ను మరో ఐదేళ్ల పాటు జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ నియమించారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వం యొక్క రెండవ టర్మ్‌లో ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వబడింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/