AP Nominated Posts: కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన.. మార్కెట్ కమిటీలకు కొత్త ఛైర్మన్లు

AP Govt Announces Chairmen for 47 Market Committees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
తాజాగా, ఏపీ సర్కార్ ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు దక్కాయి. అయితే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.