Last Updated:

Bandi Sanjay: . ‘రేవంత్‌ రెడ్డిలా పార్టీలు మారడం చేతకాదు’

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: . ‘రేవంత్‌ రెడ్డిలా పార్టీలు మారడం చేతకాదు’

Bandi Sanjay: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘ఓటుకు నోటు కేసులా డబ్బులు పంచడం నా వల్ల కాదు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఎలా నడుపు తున్నాడో జానారెడ్డి, కోమటిరెడ్డి, జాగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుంది. కాంగ్రెస్‌ ఎవరి చెప్పు చేతల్లో ఉందో? మా దగ్గర సీనియర్లు బాస్‌లు.. అదే కాంగ్రెస్‌లో అయితే హోంగార్డ్స్‌’ అంటూ బండి ఎద్దేవా చేశారు.

 

మేము గెలుపు పరంపర కొనసాగిస్తున్నాం(Bandi Sanjay)

‘హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. పార్టీ నడపడం రాకుండా ఎలా గెలుస్తాం. మేము గెలుపు పరంపర కొనసాగిస్తున్నాం. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారు. డిపాజిట్లు రాని పరంపర సాగుతోంది. మాది ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ కాదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఓవైసీ పాల్గొనలేదు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలి’ అని పేర్కొన్నారు.

 

ఆ క్రెడిట్ కిషన్ రెడ్డిదే.. (Bandi Sanjay)

‘తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయని వారికి.. తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు. జెండా ఎగురవేయనందుకు దారుస్సలాం కు తాళం వేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాం. ఆ క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కార్యక్రమాన్ని నిర్వహించేలా చేశారు’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.