Home / BJP
Operation Sindoor: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఇవాళ ఆయన మాట్లాడారు. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల […]
Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను అస్సలు వెళ్లనని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అని, ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యమంటే చేస్తానని చెప్పారు. గోషామహల్ ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ వెల్లడించారు. కాగా ఇవాళ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని […]
Olympics 2036: భారత్ 2036లో నిర్వహించబోయే ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రపంచ పోలీస్- ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృందాన్ని ఆయన ఘనంగా సన్మానించారు. కాగా ప్రపంచ పోలీస్, ఫైర్ క్రీడల్లో భారత్ 613 పతకాలు గెలుచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. దేశ తరపున అద్భుత ప్రదర్శన చేసి.. దేశాన్ని గర్వపడేలా చేశారని కితాబిచ్చారు. కాగా 2036లో నిర్వహించబోయే ఒలంపిక్స్ లో […]
PM Foregin Tour: రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జులై 23 నుంచి 26 వరకు యూకేతో పాటు, మాల్దీవుల్లో పర్యటిస్తారు. కాగా జులై 23, 24న యూకే పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. అదేవిధంగా రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తో చర్చలు జరపనున్నారు. మూడేండ్ల చర్చల […]
Hyderabad: పదేళ్లుగా భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. హైదారాబాద్ నారాయణగూడలో నిన్న కేశవ్ మెమోరియల్ కాలేజీలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ ఫౌండేషన్ డే నిర్వహించగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్వాతంత్ర్యం కంటే ముందే ఏర్పడిందన్నారు. స్వాతంత్రోద్యమంలో […]
West Bengal: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వెస్ట్ బెంగాల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా తృణముల్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల కోల్ కతాలో జరిగిన గ్యాంగ్ రేప్ పై మాట్లాడారు. నిందితులను కాపాడేందుకు అధికార తృణముల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో రూ. 5400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని రాష్ట్రానికి వచ్చారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, క్లీన్ ఎనర్జీని […]
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారుల నుంచి కీలక సమచారాన్ని సిట్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు మరో కీలక నేతకు సిట్ నోటీసులు పంపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం నమోదు చేసేందుకు సిట్ నిర్ణయించింది. […]
Are You Eating Samosas & Jalebis: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగరేట్, మద్యపానం చేసే వారికి ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిక ఉంటుందో, ఇదే తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, పడా పావ్, చాయ్ బిస్కెట్స్ వంటి స్నాక్స్ కు కూడా ఆరోగ్య హెచ్చరికలను ప్రారంభించింది. అలాగే ఆహార పదార్థాల్లో ఉడే అధిక స్థాయి నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ ని హైలెట్ చేస్తాయి. ఇవి అన్నీ […]
CM Chandrababu 2 Days Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ […]
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈసీ నిర్ణయంపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో […]