Home / BJP
Guvvala Balaraju joins BJP in Hyderabad: అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. గువ్వల బాలరాజుకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. కాగా, ఇటీవల బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల ఆ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమకారులకు సముచిత స్థానం లేదని, విపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ […]
Tiranga Yatra Under BJP In Andhra Pradesh: ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరంగా యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఆగస్టు 14 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా స్థాయిల్లో జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేయడం తో పాటు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర […]
Guvvala Balaraju Will Joined BJP: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ నేత గువ్వల బాలరాజు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని తార్నాకలో ఆయన నివాసంలో భటీ అయ్యారు. ఇందులో భాగంగా ఆగస్టు 11న అధికారికంగా గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. అంతకుముందు గువ్వల బాలరాజు బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేశారు. […]
CM Revanth Reddy: ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కులగణన చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సర్వే లెక్కల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించి రాష్ట్రపతికి పంపామన్నారు. రిజర్వేషన్లపై పోరాడేందుకే […]
Bomb Threat: నాగపూర్ లోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నివాసాన్ని పేల్చేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం 8.46 గంటలకు గడ్కరీ ఇంటిని పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కాల్ తర్వాత పోలీసులు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు వచ్చిన కొంత సమయానికి ఉమేష్ విష్ణు రౌత్ అనే అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహల్ లోని తులసి బాగ్ రోడ్ […]
Telangana: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో దేశానికి ప్రధాని ్య్యే ఛాన్స్ వచ్చినా రాహుల్ గాంధీ వదులుకున్నారని.. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన చెప్తున్నానని.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి తీరుతామని తెలిపారు. […]
Operation Sindoor: ప్రధాని మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను దారుణంగా హత్య చేసిన సంఘటనతో తన హృదయం దుఃఖంతో నిండిపోయిందని తెలిపారు. ‘నా కుమర్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. మహాదేవ్ […]
Thummala Nageswara Rao: బీజేపీ నేతలు.. వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం సరఫరా చేసిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రామచంద్రరావుకు, బీజేపీకి తెలంగాణ రైతాంగం పట్ల ఉన్న నిబద్ధతను ఏంటో తెలుస్తోందని మంత్రి తుమ్మల ఎద్దేవా […]
Urea Allotment: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేంద్రం సకాలంలో అందించడంలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని ఎన్నిసార్లు బతిమిలాడినా యూరియా ఇవ్వడం లేదని తెలిపారు. యూరియా విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శలు సరికాదన్నారు. రైతుల పట్ల చిత్తుశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వీడాలని కోరారు. యూరియా సరఫరా కోసం ఏప్రిల్ నుంచి అనేక పర్యాయాలు చర్చించామని […]
Tamilnadu: ప్రధాని రెండు రోజులు తమిళనాడులో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నిన్న తూత్తుకుడికి చేరుకున్న ప్రధాని వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం నిన్న రాత్రి తిరుచ్చిలోని ఓ హోటల్ లో బస చేశారు. ఇవాళ ఉదయం అలియలూర్ జిల్లాలో గంగైకొండ చోళపురానికి వెళ్లారు. మొదటి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు. అనంతరం సంప్రదాయ వస్త్రాలు ధరించిన ప్రధాని మోదీ గంగా జలంతో […]