Home / BJP
AIIMS Nagpur: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగరేట్, మద్యపానం చేసే వారికి ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిక ఉంటుందో, ఇదే తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, పడా పావ్, చాయ్ బిస్కెట్స్ వంటి స్నాక్స్ కు కూడా ఆరోగ్య హెచ్చరికలను ప్రారంభించింది. అలాగే ఆహార పదార్థాల్లో ఉడే అధిక స్థాయి నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ ని హైలెట్ చేస్తాయి. ఇవి అన్నీ కూడా జీవనశైలి వ్యాధులతో దగ్గరి […]
Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ […]
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈసీ నిర్ణయంపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో […]
TBJP: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఇవాళ ఓ లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజాసింగ్.. ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను సమర్పించారు. రాజాసింగ్ ఇచ్చిన లేఖను కిషన్ రెడ్డి పార్టీ హైకమాండ్ కు పంపారు. దీంతో ఆయన రాజీనామాను పార్టీ పెద్దలు ఆమోదించారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సీరియస్ […]
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం చేసి శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జివించాలని, దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. […]
PM Foregin Tour: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనను ముగించుకుని నిన్న భారత్ కు చేరుకున్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి మోదీ.. మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని అరుదైన రికార్డ్ సాధించారు. ఎక్కువ విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డ్ సృష్టించారు. ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో మోదీ ప్రసంగించారు. తాజా పర్యటనలో నమీబియా, ట్రినిడాడ్, ఘనాలో […]
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రిజిల్, నమీబియా దేశాల్లో మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే మూడు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ పర్యటనలలో మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎక్కువ విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు. తాజాగా నమీబియా, ట్రినాడాడ్, ఘానాలో మోదీ ప్రసంగించారు. నమీబియా పార్లమెంట్ […]
PM Modi Brazil Tour: బ్రెజిల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన “గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్” లభించింది. కాగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గానూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా ప్రధాని మోదీ ఈ పురస్కారం అందించారు. […]
Minister Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా, ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా టెన్త్ చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ స్వయంగా సైకిళ్లను అందజేస్తున్నారు. ఇవాళ కరీంనగర్ టౌన్ విద్యార్థులకు అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక […]
Rahul On PM Modi: అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని, ఈ విషయంలో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప మరేం చేయలేరని విమర్శించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలంటూ సవాల్ చేశారు. మూడు నెలల క్రితం భారత్ పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. […]