Published On:

Uttam Kumar Reddy: ‘భారత్- పాక్ దాడులు.. అవసరమైతే నేనూ యుద్ధానికి వెళ్తా’

Uttam Kumar Reddy: ‘భారత్- పాక్ దాడులు.. అవసరమైతే నేనూ యుద్ధానికి వెళ్తా’

Telangana: భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక దళాలు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిసైళ్లతో భారత్ పై దాడులు చేస్తోంది. కాగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చెందిన మిస్సైళ్లను నేలమట్టం చేస్తోంది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ సైన్యాలకు కాల్పులకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనామందిరాలు, జనాసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచింది.

 

అయితే భారత్- పాక్ దాడుల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దొంగ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోందని అన్నారు. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం వస్తే.. అవసరాన్ని బట్టి తాను కూడా యుద్ధంలో పాల్గొంటానని సంచలన ప్రకటన చేశారు. దేశ రక్షణలో భాగంగా ఇండియన్ ఆర్మీ చేస్తున్న సాహసం ఎంతో గొప్పదని అన్నారు. ‘పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. టెర్రరిస్టులు నిరాయుధులైన వారిని కాల్చి చంపడం అమానవీయ చర్య. హిందూ, ముస్లింల మధ్య విభేదాలు పెంచడానికే ఇలాంటి పని చేశారు. దానికి ప్రతీకారంగా ఇండియా చేస్తున్న స్ట్రైక్స్ అద్భుతం’ అంటూ చెప్పుకొచ్చారు.

 

కాగా ‘ఇండియన్ హ్యామర్ అనే బాంబులను ప్రయోగించింది. 100 కిలోమీటర్ల వరకు టార్గెట్ వరకు దాడులు చేశారు. మన రఫెల్ విమానాన్ని కూల్చేశాం అని పాక్ చేస్తున్న ప్రచారం ఉత్తదే. ఇండియన్ ఆర్మీ బలం ప్రపంచమంతా చూసింది. అందరూ ఇండియన్ ఆర్మీకి మద్దుతుగా ఉండాలి. ఎలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయబోం. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటాం’ అని ఉత్తమ్ తెలిపారు.