Published On:

Mahesh Babu Sister in Law: మహేష్ బాబు కుటుంబంలో కరోనా కలకలం..!

Mahesh Babu Sister in Law: మహేష్ బాబు కుటుంబంలో కరోనా కలకలం..!

Mahesh Babu Sister in Law got Covid-19 Positive: కరోనా  పేరు వింటేనే భయంతో వణికిపోతారు. కరోనా వలన ఎందరో తమ ఆఫ్తులను కోల్పోయారు. కరోనా ( Covid-19 ) సోకితే రక్తసంబంధీకులు కూడా వెలివేసిన రోజులవి. శ్వాస ఆడని ఓ రోగం ప్రపంచాన్ని కబలించింది. ఒక రకంగా భారత్ కరోనాను సమర్థంగానే ఎదుర్కొంది. రోజులు గడిచినా కరోనా గండం గట్టెక్కిందని అనుకుంటున్న ఈ రోజుల్లో మళ్లీ తన ఉనికిని చూపుతుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది.

 

మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరికి కరోనా సోకింది. నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ సోకినట్లుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కరోనా ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో మల్లీ కరోనా భయం పట్టుకుంది. రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

 

శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడటంతో ఒక్కసారిగా సినీ వర్గాలు అలర్ట్ అయ్యాయి. శిల్ప శిరోద్కర్ హిందీలో బిగ్ బాస్ 18లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తాజాగా తాను కోవిడ్ బారిన పడినట్లు ఇన్ స్టా లో పోస్ట్ పెట్టింది. ఆరోగ్యంపై హై ప్రియారిటీ ఇచ్చే మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా రావడంతో మిగితావాళ్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శిల్ప గత 15 రోజులుగా ఎవరెవరిని కలిసిందని తెలుసుకుని వారందరూ క్వారంటీన్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

 

ప్రజలు కూడా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైనా దగ్గినా తుమ్మినా అక్కడే ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముక్కుకు మాస్క్ ధరించాలని చెప్పారు. కరోనా వచ్చాక బాధపడేకంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అన్నారు.

ఇవి కూడా చదవండి: