MP DK Aruna as FCI Chair Person: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతలు!

MP DK Aruna appointed as FCI Chair Person of Telangana by Central Govt.: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్గా ఎంపీ డీకే అరుణను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ మేరకు ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.