MLC Kavitha Letter to KCR: BJPతో పొత్తుపై కేసీఆర్కు కవిత బహిరంగ లేఖ..!

MLC Kavitha Letter to KCR: స్వదస్తూరితో కేసీఆర్కు కవిత రాసిన లేఖ సంచలన రేపుతోంది. ఆరు పేజీ లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పులను గురించి ప్రస్తావించారు. లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. 2001 నుంచి మీతో నడిచిన వారికి.. సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్నారు. కేసీఆర్.. ఆపరేషన్ కగార్పై మాట్లాడటం అందరికీ నచ్చిందని కవిత పేర్కొన్నారు. పర్సనల్గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం హుందాగా అనిపించిందన్నారు. తెలంగాణ తల్లి, గీతాన్ని మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదన్నారు. ఉర్దూ, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని లేఖలో ప్రస్తావించారు.
బీజేపీపై కేసీఆర్ 2నిమిషాలు మాట్లాడటంతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుంటారనే చర్చ జరుగుతోందని కేసీఆర్ దృష్టికి కవిత తీసుకొచ్చారు. బీజేపీపై గట్టిగా మాట్లాడుంటే బాగుండేదన్నారు. పార్టీలో ముఖ్య నేతలు మిమ్మల్ని కలవలేక పోతున్నారని.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నారని కవిత లేఖలో ప్రస్తావించారు. కొంతమందిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నించండని కేసీఆర్కు కవిత సూచించారు.