Last Updated:

Veera Simhareddy : బాలకృష్ణ “వీర సింహారెడ్డి” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అన్ని ఏర్పాట్లు షురూ… గెస్ట్‌గా మెగాస్టార్?

నందమూరి నటసింహం బాలకృష్ణ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Veera Simhareddy : బాలకృష్ణ “వీర సింహారెడ్డి” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అన్ని ఏర్పాట్లు షురూ… గెస్ట్‌గా మెగాస్టార్?

Veera Simhareddy : నందమూరి నటసింహం బాలకృష్ణ – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఈ నెల 6వ తేదీన ‘ఒంగోలు’లో ప్లాన్ చేశారు. మొదట ఒంగోలులోని AMB గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఏపీలో నెలకొన్న జీవో నెంబర్ 1 కారణంగా భారీ సభలకు పర్మిషన్ రిజెక్ట్ చేస్తుండటంతో వీరనరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఈ ప్రభావం పడింది. అయితే ఒంగోలులోని ఏఎంబీ గ్రౌండ్స్‌లో పలు కారణాల రీత్యా ఈ వేడుకకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్థలాన్ని మాత్రమే మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌లో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అఖండ సినిమాతో బాక్సులు బద్దలు కొట్టిన తమన్ ఈ సినిమాలో కూడా మరోసార్వ టాలెంట్ నిరూపించుకుంటాడని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పరి రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారనే ఊహాగానాలు కూయ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి, మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆ రోజున రాత్రి 8:17 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి మానియా తో సోషల్ మీడియా ఫుల్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: