Nandamuri Balakrishna: ‘పద్మ భూషణ్’ అవార్డుపై స్పందించిన బాలయ్య – ఏమన్నారంటే!

Nandamuri Balakrishna Comments on Padma Bhushan Award: ‘సరైన సమయంలోనే నాకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది’ అని సినీ నటుడు, హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలక్రష్ణ ఆనందం వ్యక్తం చేశారు. నిన్న ఏప్రిల్ 28న ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానొత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.
ఈ పురస్కార ప్రదానొత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ భుషణ్ అవార్డును వరించడం చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్న. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. నిజానికి నాకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. కానీ వారికి నా సమాధానం ఒక్కటే. నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చింది. నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా నా సినీ కెరీర్ ప్రారంభంచి 50 ఏళ్లు పూర్తయ్యింది. నాకేంతో ప్రత్యేమైన ఈ ఏడాదిలోనే పద్మ భూషణ్ రావడం మరింత ప్రత్యేకమైంది” ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది గణతంత్ర్య దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 139 మందికి ఈ పద్మ అవార్డులు వరించాయి. ఏడుగురు పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. బాలయ్యతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, నటి శోభనతో పాటు పలువురి పద్మ భూషణ్ అవార్డు వరించింది.