Fire Accident: అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్

Breaking News: Fire Accident: గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి సమగ్ర విచారణ కు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్గటనలు జరుగకుండా చూడాలన్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. గుల్జార్ హౌస్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. భవనంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులతో రేవంత్ ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి పొన్నం.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.