Last Updated:

KGF Babu: కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే ప్రజలకు రూ.350 కోట్లు విరాళం ఇస్తాడట..

బెంగళూరు మిల్లర్స్ రోడ్‌లోని తన విలాసవంతమైన ఇంట్లో కూర్చున్న యూసఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ కార్యకర్తలను కలవడంలో బిజీగా ఉన్నారు. అయితే అతనికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు. కాని చిక్‌పేట అసెంబ్లీ సీటు

KGF Babu: కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే ప్రజలకు రూ.350 కోట్లు విరాళం ఇస్తాడట..

Bengaluru: బెంగళూరు మిల్లర్స్ రోడ్‌లోని తన విలాసవంతమైన ఇంట్లో కూర్చున్న యూసఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ కార్యకర్తలను కలవడంలో బిజీగా ఉన్నారు. అయితే అతనికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు. కాని చిక్‌పేట అసెంబ్లీ సీటును ఆశిస్తున్న వ్యక్తిగా తనను ప్రకటించుకుంటూ షరీఫ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐదేళ్లపాటు (2022-2027) తన విద్య మరియు సంక్షేమ పథకంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి రూ.5,000 అందించడానికి తన వ్యక్తిగత నిధుల నుండి దాదాపు రూ.350 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సలహాలు కోరుతూ తన నివాసంలో చాలా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రూ. 1,743-కోట్ల ఆస్తులు..

2021లో బెంగళూరు అర్బన్ స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేసినపుడు బాబు తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 1,743-కోట్ల ఆస్తులను ప్రకటించి అందరిదృష్టిని ఆకర్షించారు. దీనితో అతను కర్ణాటకలో అత్యంత ధనిక రాజకీయవేత్త అయ్యారు.అయితే షరీఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 397 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇపుడు కాంగ్రస్ పార్టీ తరపున చిక్ పేట అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ బ్యానర్‌లో విద్యా/స్కాలర్‌షిప్/సామాజిక సంక్షేమ కార్యక్రమంతో ముందుకు సాగడానికి కాంగ్రెస్ హైకమాండ్ నుండి అనుమతి కోరాడు.ఆగస్టు 31 లోపు తనకు అనుమతి మంజూరు అవుతుందని భావిస్తున్నారు.

తన మేనిఫెస్టో ప్రకారం, షరీఫ్ చిక్‌పేటలోని 50,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 చెక్కును పంపిణీ చేస్తారు. 50 వేల కుటుంబాలకు ఐదేళ్లకు దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ అవుతుంది. ప్రీ యూనివర్సిటీ విద్యార్థులకు మరో రూ.5,000 అందజేస్తారు. ఇది దాదాపు 5,000 మంది విద్యార్థులకు సహాయం చేస్తుంది. నేను దాని కోసం రూ. 7.5 కోట్లు కేటాయించాను” అని షరీఫ్ తెలిపారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని మురికివాడల కోసం రూ.180 కోట్లతో బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను నిర్మించే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇది లిఫ్టులు మరియు ప్రామాణిక పౌర సౌకర్యాలతో సహా సౌకర్యాలను కలిగి ఉంటుంది.మురికివాడల నివాసితులు తమ భూమిని నాకు అందించడానికి సిద్ధంగా ఉంటేనే నేను దీనిని చేపట్టగలను. రూ. 6 లక్షలతో నిర్మించిన ఫ్లాట్‌లో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను, దానిని నేను నా ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చేస్తానని షరీఫ్ తెలిపారు.

పేదరికం నుంచి కోట్లకు అధిపతిగా ..

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) ప్రాంతానికి చెందిన షరీఫ్‌కు ‘కెజిఎఫ్ బాబు’ అనే పేరు వచ్చింది. అతను రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించే వరకు స్క్రాప్ డీలర్‌గా ఉన్నందున అతన్ని ‘స్క్రాప్ బాబు’ అని కూడా పిలుస్తారు.14 మంది తోబుట్టువులలో పెద్దవాడు, షరీఫ్ తన కుటుంబం కడు పేదరికంలో జీవించిందని చెప్పాడు. వారి కుటుంబం యొక్క బేకరీ వ్యాపారం నష్టాల్లో కూరుకుపోవడంతో అతని తండ్రి ఆటోరిక్షా నడిపాడు. కేవలం ఒక పూట భోజనంతో తమ కుటుంబాన్ని పోషించుకున్న రోజులు ఉన్నాయని అన్నారు. కెజిఎఫ్ లో బంగారు తవ్వకంలో నిమగ్నమై ఉన్న భారత్ గోల్డ్ మైన్స్‌తో స్క్రాప్ డీలర్ అసోసియేట్‌గా పని చేయడం ప్రారంభించాడు. తరువాత అతను కోలార్‌లోనే కాకుండా బెంగళూరు నగరంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 2021లో షరీఫ్ రూ. 100 కోట్ల విలువైన చరాస్తులను, రూ. 1,643.59 కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు. నా డబ్బు కష్టపడి సంపాదించింది. జూలైలో నాకు ఈడీ సమన్లు ​​పంపింది. నేను కాంగ్రెస్‌కు చెందిన వాడిని కాబట్టే నన్ను టార్గెట్‌ చేసింది. నేను ఈడీకి భయపడనని షరీఫ్ అన్నారు.

చదవడం, రాయడం రాదు..

మనీలాండరింగ్ అనే పదానికి అర్దం తనకు తెలియదని షరీఫ్ అన్నారు. స్కూల్ డ్రాపవుట్ కావడంతో అతని చదవడం, రాయడం రాదు. అమితాబ్ బచ్చన్ నుండి షరీఫ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కొనుగోలు చేసారు. అయితే పత్రాలు లేకపోవడంతో రవాణా అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. 1.10 కోట్ల విలువైన హ్యాండ్‌మేడ్ వాచ్, 5 కిలోల బంగారం కూడా తన వద్ద ఉన్నట్లు షరీఫ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అతని ఆస్తులు బెంగళూరు మరియు కోలార్ మరియు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్, వ్యవసాయ ప్లాట్ల రూపంలో ఉన్నాయి. అతనికి ఇద్దరు భార్యలు రుక్సానా తాజ్ మరియు షాజియా తరన్నమ్. ఐదుగురు పిల్లలు ఉన్నారు. మరి ఈ కోటీశ్వరుడికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి తన ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి: