Published On:

Kedarnath helicopter crash: ల్యాండింగ్‌కు ముందు హెలికాప్టర్ క్రాష్.. భయాందోళనలో భక్తులు

Kedarnath helicopter crash: ల్యాండింగ్‌కు ముందు హెలికాప్టర్ క్రాష్.. భయాందోళనలో భక్తులు

Helicopter crash in Kedarnath Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్ దగ్గర ఓ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ముందు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు భయాందోళనకు గురయ్యారు.

 

వివరాల ప్రకారం.. కేదార్‌నాథ్ దర్శించుకునేందుకు భక్తులు హెలికాప్టర్‌లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ముందే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా విరిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 

కాగా, కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపి చార్ ధామ్ యాత్రగా పిలుస్తారు. ఈ యాత్రలో భాగంగా తొలుత గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. ఇందులో భాగంగా నిత్యం భక్తులు సందర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ సమయంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

 

ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇదిలా ఉండగా.. రిషికేష్ ఎయిమ్స్‌కు చెందిన ఈ హెలికాప్టర్ ఓ పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో సడెన్‌గా టెక్నికల్ లోపం కారణంగా క్రాష్ అయినట్లు వెల్లడించారు.

 

సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే హుటాహుటినీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ గవర్న్ మెంట్‌కు చెందినదిగా సమాచారం.