Accident: కర్నాటకలో బస్సు- కారు ఢీ.. ఆరుగురు దుర్మరణం

Karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయపుర జిల్లాలో ఇవాళ ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు.
కాగా సోలాపూర్ వెళ్తున్న కారు బసవనబాగే తాలూకాలోని మనగులి సమీపంలోకి రాగానే ముంబై నుంచి బళ్లారికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపుతప్పి ఢీకొంది. దీంతో బస్సు అదపుతప్పి కంటైనర్ ను ఢీకొంది. దీంతో ఐదుగురు వ్కక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించారు. మృతుల్లో ట్రావెల్ బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ లో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.