CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బాబు బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మద్దతు కోరుతూ ఒక ప్రతిపాదన సమర్పించారు.ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఈ ఏడాది జూన్ నాటికి సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్రమంత్రి అమిత్షాతో సీఎం భేటీ అయ్యారు. అంతకుముందు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ల్లో ఏపీకి సహకరించాలని కోరారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో సీఎం భేటీ అయ్యారు. BEL డిఫెన్స్ కాంప్లెక్స్, HAL -AMCA కార్యక్రమంతోపాటు..ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చించారు.
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ప్రతిపాదనను సమర్పించారు సీఎం. కేంద్రమంత్రి జితేంద్రసింగ్తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ను అంతరిక్ష తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో..సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు అందించారు.
Had a productive meeting with Union Finance Minister @nsitharaman Ji in Delhi today. We discussed the crucial Polavaram-Banakacherla project aimed at taking Godavari waters to the drought-hit regions of Andhra Pradesh. Powered by Centre-State collaboration, this river-linking… pic.twitter.com/K9SOAQGHuc
— N Chandrababu Naidu (@ncbn) May 23, 2025