Khushbu Sundar: ఏ యుగంలో బతుకుతున్నాం – సిగ్గుగా అనిపించడం లేదా?: నటి ఖుష్బూ ఆగ్రహం

Khushbu Fires on Tamil Nadu Incident: తమిళనాడులో ఓ విద్యార్థిని పట్ల అవమానీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి పేరిట ఆ విద్యార్థినిని తరగతి బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ మనం ఏ యుగంలో బతుకుతన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నెలసరి కారణంగా విద్యార్థినిని క్లాస్ రూమ్ బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించడం విచారకరం. ఈ ఘటన నన్నేంతో ఆవేదనకు గురి చేసింది. ఇలాంటి అవమానీయ ఘటన నా రాష్ట్రంలోనే జరగడం షాక్కు గురి చేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఎక్కడ ఉన్నాం? ఇలాంటి పనులకు పాల్పడిన విద్యాసంస్థలు, అందులోని సిబ్బందికి ఏ మాత్రం సిగ్గుగా అనిపించడం లేదా? వారిపై తప్పకుండ చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆ విద్యార్థినికి వారు క్షమాపణలు చెప్పాలి. నెలసరి అనేది సర్వసాధారణం. అది సహాజమైన చర్య, మానసిక పరిపక్వత లేని ఇలాంటి అధికారులకు గుణపాఠం నేర్పించాలి” అని ఖుష్బూ మండిపడ్డారు.
This is absolutely appalling and disgusting. Yet another news from my State that shocks me. A child made to sit outside during exams because she was having her periods. Which world are we living in? Which century? Aren't such educational institutes and those in authoritive…
— KhushbuSundar (@khushsundar) April 11, 2025