Brahmos Missile Production Unit: బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్!

Brahmos Missile Production Unit Started by Rajnath Singh: బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ను ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ రోజు మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించిన ఆయన… ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోయినట్లు చెప్పారు. ఇదే రోజున పోక్రాన్ అణు పరీక్షలు చేసినట్లు గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఇవాళ బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభమైంది. 80 ఎకరాల్లో బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్ ఏర్పాటు చేశారు. 300 కోట్ల పెట్టుబడితో ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. రక్షణ రంగంలో భారత్ కీలకమైన ముందడుగు వేసింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ యూనిట్ కీలకంగా మారింది.
పాకిస్తాన్ కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లే లక్ష్యంగా భారత్ వైమానిక దాడులు చేసింది. ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. సర్గోడా ఎయిర్ బేస్ పైనా భారత వైమానిక దాడులు చేసింది. సర్గోడా ఎయిర్ బేస్ లోనే పాకిస్తాన్ అణ్వాయుధాల బంకర్ ఉంది. అణ్వాయుధాల బంకర్ పైనా క్షిపణులు పడ్డట్టు తెలుస్తోంది. దాదాపు ఏడు నుంచి 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు ధ్వంసం అయినట్టు సమాచారం.
భారత వైమానిక దశం ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని ట్వీట్ చేసింది. దీంతో ఒక్కసారిగా దేశం అలర్ట్ అయింది. కాసేపట్లో వివరాలను వెళ్లడిస్తామని చెప్పింది. భారత్ సైన్యం..మోదీ ఆర్డర్స్ కోసం వెయిటింగ్ లో ఉంది. 48 గంటల్లో మూడోసారి త్రివిధ దళాలతో మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన తరువాత హై లెవల్ మీటింగ్ జరుగుతోంది.
జాతీయ భద్రతాధికారులంతా ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. పాక్ వక్రబుద్దికి సమాధానం చెప్పేలా నిర్ణయం తీసుకోనున్నారు. నిన్నటి పరిమాణాలను మోదీకి టాప్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వివరిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ అనిల్ చౌహాన్ మోదీతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
#WATCH | Defence Minister Rajnath Singh says, “At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn’t come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ
— ANI (@ANI) May 11, 2025