Published On:

Operation Sindoor : తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పంచించాం : సీడీఎస్ కీలక వ్యాఖ్యలు

Operation Sindoor : తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పంచించాం : సీడీఎస్ కీలక వ్యాఖ్యలు

CDS General Anil Chauhan Key comments : పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తమ తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పందించామని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట నిజమేనని అంగీకరించారు. అయినా వెంటనే సవాళ్లను అధిగమించి శత్రుమూకలపై విరుచుకుపడ్డామన్నారు. ఈ సందర్భంగా కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనన్నారు. ఆరు జెట్‌లను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదన మాత్ర తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు.

 

సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రీ-లా డైలాగ్‌లో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధవిమానం కూలిపోవడమనేది ముఖ్య విషయం కాదన్నారు. ఎందుకు జరిగిందో తెలుసుకోవడమే ముఖ్యమన్నారు. తమ వైపు జరిగిన తప్పిదాలను వెంటనే గుర్తించామన్నారు. తప్పులను సరిదిద్దుకొని రెండు రోజుల్లో మళ్లీ విజయవంతంగా అమలు చేశామన్నారు. సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా యుద్ధ విమానాలను మోహరించామని వెల్లడించారు.

 

ఇదే విషయంపై భారత వాయుసేనలో డైరక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ గతంలోనే స్పందించారు. నష్టం జరగడమనేది పోరాటంలో భాగమే అన్నార. వాయుసేన పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని తెలిపారు. తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై సాయుధ దళాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఈ విధంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి: