Published On:

Ayodhya: అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం.. ఇక అవి బంద్

Ayodhya: అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం.. ఇక అవి బంద్

Uttar pradesh: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య. రామజన్మభూమి ఎంతో ప్రఖ్యాతి పొందింది. అంతటి ప్రాముఖ్యత ఉన్న నగర విశిష్టతను కాపాడేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పరిధిలో మద్యం, మాంసం, అసభ్యకరమైన ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. కొత్తగా ప్రవేశపెట్టిన నిషేధాజ్ఞలు అయోధ్య మందిరానికి 14 కిలోమీటర్ల దూరం వరకు అమలులో ఉంటాయి. అయోధ్య, ఫైజాబాద్ ను కలిపే రామ్ పథ్ మార్గంలో ఈ నిషేధం అమలు కానుంది.

ఈ మేరకు అయోధ్య మేయర్ గిరీష్ పాటి త్రిపాఠి మాట్లాడారు. నగరంలో ఆధ్యాత్మిక, మతపరమైన అంశాలను కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అందుకే మేయర్, డిప్యూటీ మేయర్, 12 మంది కార్పొరేటర్లతో కూడిన అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కార్యనిర్వహాక కమిటీ నిషేధాన్ని అమలు చేసేందుకు తీర్మానాన్ని ఆమోదించింది. అందుకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు.