Ex Army Man Killed: మాజీ ఆర్మీ ఆఫీసర్ హత్య, ప్రియుడితో కలిసి చంపిన భార్య

Ex Army Man Killed: మాజీ ఆర్మీ అధికారి హత్యచేయబడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాలియా జిల్లాలో జరిగింది. దేవేంద్ర కుమార్ ఆర్మీలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య మాయా ధేవి ఆమెతో అక్రమ సంబంధం కలిగిన అనిల్ కుమార్ యాదద్ తో కలిసి దేవేంద్ర కుమార్ ను హతమార్చారు. అతన్ని ఆరు ముక్కులుగా వేరుచేసి ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలోని నది ఒడ్డున వేర్వేరు ప్రదేశాలలో పడవేశారు. ఈ హత్యలో మాయాదేవి ఆమె ప్రియుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాయాదేవి ఆమెతో అక్రమ సంబధం పెట్టుకున్న అనిల్ యాదవ్ తోకలిసి దేవేంద్ర కుమార్ ను చంపడానికి కుట్రపన్నింది. ఇందుకు అనిల్ మాయాదేవీలకు సనీష్ యాదవ్, మిథిలేష్ అనే డ్రైవర్ సహకారాన్ని అందించారు. మే10న ఖరీద్ గ్రామంలో మొదటగా ఒక మృతదేహం ముక్కలుగా కనిపించాయని పోలీసులు తెలిపారు. మొదట్లో తెగిపోయిన అవయవాలు కనిపించగా, మరో రెండు రోజుల తర్వాత సమీపంలోని బావిలో మొండెం కనిపించింది. బాధితుడి తల మాత్రం దొరకలేదు, దానిని గుర్తించడానికి పోలీసు గజ ఈతగాళ్లు ( డైవర్లు) ఘాఘరా నదిలో గాలింపులు జరుపుతున్నారు.
అయితే… మాయా దేవి మే 10న పోలీస్ స్టేషన్లో తన భర్త దేవేంద్ర కుమార్ కనిపించకుండా పోయిండని ఫిర్యాదు నమోదు చేసింది. ఆమె భర్త బీహార్లోని బక్సర్ రైల్వే స్టేషన్ నుండి తమ కుమార్తెను తీసుకురావడానికి వెళ్లాడని, తిరిగి రాలేదని ఆరోపించింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులో, స్వాధీనం చేసుకున్న మొండెం దేవేంద్ర కుమార్తో సరిపోల్చారు. మాయాదేవిపై అనుమానం వచ్చి విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమెతో పాటు అనిల్, సనీష్ యాదవ్, మిథిలేష్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.