Published On:

Bandi Sanjay: కవితపై బండి సంజయ్ ఫైర్..!

Bandi Sanjay: కవితపై బండి సంజయ్ ఫైర్..!

Bandi Sanjay:  కవిత వ్యవహారంపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తోందన్నారు. బీఆర్ఎస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తోందని..హరీష్‌రావు, కవిత, కేటీఆర్, సంతోష్‌ మధ్య నాలుగు ముక్కలాట ఉందన్నారు. కేసీఆర్ జోకర్‌ ప్లేస్‌లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ గొడవ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పొలిటికల్ డ్రామా నడుస్తోందని బండి సంజయ్ చెప్పారు.

 

తెలంగాణ జాగృతి సంస్థ బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆచార్య జయశంకర్‌ స్పూర్తితోనే పురుడు పోసుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత.. కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ పార్టీ, తెలంగాణ జాగృతి రెండు కళ్లలాగా పనిచేస్తాయని తెలిపారు.

 

తెలంగాణ గ్రహచారం బాగోక రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్న కవిత.. యువతకు చేయూతనిచ్చే పథకానికి రాజీవ్‌ గాంధీ పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోమన్న ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రానికి నిధులు, నీళ్ల విషయంలో నష్టం జరుగుతున్నా . సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: