Last Updated:

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్రగాయాలు !

చిత్తూరు జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్రగాయాలు !

Road Accident : చిత్తూరు జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కాగా విషయం గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్చి ఉంది.