Home / latest ap news
ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
ఏపీ సీఎం జగన్ కు తన చిన్నమ్మ ,వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు .ఇప్పటి వరుకు వివేకానంద రెడ్డి హత్య కు సంబంధించి అయన సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటివరకు జగన్కు లేఖ రాయడం కానీ ,జగన్ ను విమర్శించడం గాని చేయలేదు . తొలిసారి గా సౌభాగ్యమ్మ లేఖ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది .
పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.
మేము ఓడితే నాకు కానీ చంద్ర బాబు కు ఏమి కాదు .కాని రైతులు,కార్మికులు ,విద్యార్థులు దెబ్బతింటారు .ఇది చూస్తూ నేను ఉరుకోలేను .అందుకే కూటమి కట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ-జనసేన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల లో జ్యూట్ మిల్లు ను తెరిపిస్తామని చెప్పారు..
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ను పంపాలని సూచించింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 3వేల7వందల 43 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇందులో మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు