Last Updated:

AP High Court : జగన్ సర్కారుకి దిమ్మతిరిగే షాక్.. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

AP High Court : జగన్ సర్కారుకి దిమ్మతిరిగే షాక్.. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

AP High Court : జగన్ సర్కారుకి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతి పరిధిలో భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై  అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ తరరపు ఇచ్చింది. మరి హైకోర్టు ఉత్తర్వులపై  ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఒక వైపు ఈ తీర్పుపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. వైకాపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ గత నెల 24న ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆర్ -5 జోన్ లో 47, 516 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి.. గుంటూరు, పెద్దకాకాని, విజయవాడ, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు  చెందిన పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు పట్టాలు కూడా పంపిణీ చేసింది. అయితే ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాలకు చెందిన వారిని  ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గతంలో సవాల్ చేశారు.

CM Jagan

అయితే ఆర్-5 జోన్ లో పట్టాలిచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే  ఏపీ హైకోర్టు (AP High Court) తుది తీర్పు తర్వాతే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పులోని  ఈ అంశాన్ని హైకోర్టులో విచారణ సందర్భంగా  రైతుల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి  వ్యతిరేకంగా వస్తే  ఈ లోపుగానే  ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తే ఈ నష్టం ఎవరు భరిస్తారని కూడ విచారణ సందర్భంగా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు జగన్ సర్కారు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.