Last Updated:

Jharkhand: విద్యార్థిని బట్టలు విప్పించిన టీచర్.. బాలిక ఆత్మహత్యాయత్నం..!

ఓ టీచర్‌ చేసిన అనాలోచిత పని వల్ల ఓ విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ విద్యార్థిని అనుమానించిన  టీచర్.. ఆ బాలికపై చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీనితో ఒంటికి నిప్పంటించుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని జమ్‌షెడ్‌పూర్‌లో జరిగింది.

Jharkhand: విద్యార్థిని బట్టలు విప్పించిన టీచర్.. బాలిక ఆత్మహత్యాయత్నం..!

Jharkhand: ఓ టీచర్‌ చేసిన అనాలోచిత పని వల్ల ఓ విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ విద్యార్థిని అనుమానించిన  టీచర్.. ఆ బాలికపై చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీనితో ఒంటికి నిప్పంటించుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని జమ్‌షెడ్‌పూర్‌లో జరిగింది.

జమ్‌షెడ్‌పూర్‌కు చెందిన 9వ తరగతి చదువుతోన్న ఓ బాలిక ఇటీవల పాఠశాలలో జరిగిన పరీక్షలకు హాజరైంది. అయితే అదే సమయంలో పరీక్షాహాలుకు ఇన్విజిలేటర్‌గా ఉన్న ఓ టీచర్‌ సదరు బాలిక కాపీయింగ్ చేస్తోందని అనుమానించి, పక్క గదిలోకి తీసుకెళ్లి బట్టులు విపించింది. ఆ బాలిక కాపియింగ్ చెయ్యలేదు అని ఎంత ప్రతిఘటించినా ఆ టీచర్‌ మాత్రం ససేమిరా ఒప్పుకోకుండా విద్యార్థిని చేత బట్టలు విప్పించింది. దానితో తనకు జరిగిన అవమానాన్ని భారంగా భావించిన ఆ బాలిక ఇంటికి వెళ్లగానే ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన బాలిక కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఆ విద్యార్థిని చావుబతుకుల మధ్య ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు. దానితో స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. వెంటనే సదరు టీచర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 25 మంది మృతి, 110 మందికి గాయాలు

ఇవి కూడా చదవండి: