Published On:

Bengaluru Metro: మెట్రో మహిళా ప్రయాణికుల ఫోటోలు అక్రమంగా తీసి ఇన్‌స్టా పేజ్ నడుపుతున్నారు

Bengaluru Metro: మెట్రో మహిళా ప్రయాణికుల ఫోటోలు అక్రమంగా తీసి ఇన్‌స్టా పేజ్ నడుపుతున్నారు

Bengaluru Shocker: పిచ్చి పరాకాష్టకు చేరింది. కొందరు ఆకతాయిల పనులు తోటి ప్రజల ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కాల ప్రభావమో లేక పెరిగిన జనం వల్లనో తెలియడం లేదు కాని యువతకు సరైన విలువలు, విచక్షణ చిన్నప్పుడే అందడం లేదన్నది అర్థం అవుతోంది.

 

 

మెట్రో.. ఈ పేరు వింటే చాలా అది పేరెన్నికైన నగరంగా ఇట్టే చెప్పేయొచ్చు. ప్రస్తుత నగర పరిస్థితులకు అనుగునంగా ప్రజల అవసరాలను అర్థం చేసుకుని అన్ని పెద్ద నగరాల్లో మెట్రోను ఏర్పాటుచేసుకున్నాయి ఆయా ప్రభుత్వాలు. అయితే కొందరు ఆకతాయీల వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బెంగళూరు మెట్రోలో ఓ ఆకతాయి మహిళల ఫొటోలను కెమెరాలో బందించి ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నడుపుతున్నాడు. ఇందులో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

 

 

 

బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళల ఫొటోలు వారి అనుమతి లేకుండా తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పేరు మెట్రో చీక్స్. ఇందులో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఎక్స్ యూజర్ ఒకరు ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ను గుర్తించి, పోలీసులకు ట్యాగ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆపేజీ నుంచి ఫొటోలను డిలీట్ చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

 

మెట్రోలో ఎవరైనా అనుమానాస్పదంగా మొబైల్ పట్టుకుని కనిపించినా వెంటనే వారిని ప్రశ్నించాలని పోలీసులు తెలిపారు. మెట్రోలో ప్రయాణించే మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: