Published On:

Drone Like objects : రాత్రి వేళ కోల్‌కత్తాలో డ్రోన్ల లాంటి వస్తువులు కలకలం.. పోలీసుల అప్రమత్తం

Drone Like objects : రాత్రి వేళ కోల్‌కత్తాలో డ్రోన్ల లాంటి వస్తువులు కలకలం.. పోలీసుల అప్రమత్తం

Drones in Kolkata : కోల్‌కతాలో ఇటీవల కాలంలో రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు కనిపిస్తుండటం కలకలం రేపింది. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

కోల్‌కతా నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు తదితర ప్రాంతాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై నివేదిక అందిందని, దర్యాప్తు కొనసాగుతోందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై కేంద్రం బెంగాల్ సర్కారు నుంచి నివేదిక కోరినట్లు సీనియర్ అధికారి తెలిపారు.

 

డ్రోన్లను పోలిన వస్తువుల కదలికను హేస్టింగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు మొదట గుర్తించారు. వీటికి డ్రోన్లతో పోలికలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఇవి వచ్చాయని తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కోల్‌కతా డిటెక్టివ్ విభాగాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని వెల్లడించారు. డ్రోన్లు ఎవరికి సంబంధించినవి? వీటితో ఎవరైనా గూఢచర్యానికి పాల్పడుతున్నారా? అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: