Last Updated:

Keerthi Suresh : దసరా మూవీ యూనిట్ కి బంగారం గిఫ్ట్ లు ఇచ్చిన కీర్తి సురేష్..

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “నాగ్ అశ్విన్ తెరకెక్కించిన "మహానటి" సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.

Keerthi Suresh : దసరా మూవీ యూనిట్ కి బంగారం గిఫ్ట్ లు ఇచ్చిన కీర్తి సురేష్..

Keerthi Suresh : నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన “మహానటి” సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.

ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.

దర్శకనిర్మాతలు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకున్నారు.

కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేయడంతో కీర్తి నటించిన ఏ ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా సక్సెస్ కాలేదు.

‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖి’ లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించాయి.

కాగా మరోవైపు రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ సినిమాలో రజినీకి చెల్లెలిగా కనిపించింది ఈ భామ.

ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చినా… హిట్ టాక్ ను సాధించలేకపోయింది.

ఇక భారీ ఆశలు పెట్టుకొని నటించిన మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

దసరా పైనే కీర్తి సురేష్ ఆశలు..

కాగా కీర్తి సురేష్, నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.

సింగరేణి బొగ్గు గ‌నులు నేపథ్యంతో వస్తున్న ఈ మూవీలో నాని రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నారు.

సముద్రఖని, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీరా జాస్మిన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మార్చి 30వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

బంగారు కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్ ..

90వ కాలం నాటి కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.

దీంతో కీర్తి సురేష్ చిత్ర యూనిట్ కి బంగారు కానుకలు ఇచ్చి ఆశ్చర్య పరిచింది అని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం పని చేసిన 130 మందికి రెండు గ్రాములు బంగారు కాయిన్స్ ని బహుమతిగా ఇచ్చిందట.

ఇందుకోసం కీర్తి దాదాపు 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని బహుమతులు తీసుకున్న వారు సోషల్ మీడియా ద్వారా కీర్తికి థాంక్యూ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అదే విధంగా ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి రివాల్వర్ రీటా కాగా మరొక చిత్రం వివరాలు తెలియాల్సి ఉంది.

అంతేకాక మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ మూవీలో చిరంజీవికి చెల్లిగా కీర్తి నటిస్తుంది.

ఈ సినిమాని మెహర్ రమేష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్న మెగాస్టార్ ఆ ఫామ్ తో భోళా శంకర్ తో కూడా కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/