DC vs MI: IPL 2025: ఢిల్లీ టార్గెట్ 181..! రాణించిన సూర్యకుమార్ యాదవ్

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. నిర్ణిత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ను 5 వికెట్లు తీసి 180పరుగులకు కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాంటింగ్ కు దిగిన ముంబై ఓపెనర్లలో రోహిత్ శర్మ ఐదుపరుగులకే రహమాన్ బౌలింగ్ లో అభిషేక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ర్యాన్ మాత్రం 18బంతులకు 25 పరుగులు చేశాడు.
ఫస్ట్ డౌన్ లో దిగిన విల్ జాక్స్ 13 బంతులాడి 21పరుగులు చేసి ముకేష్ బౌలింగ్ లో విప్రజ్ కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం బరిలోకి దిగిన సూర్య కుమార్ 43 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. థర్డ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ సూర్య కుమార్ యాదవ్ తో జతకలిసాడు. 27 బంతుల్లో 27పరుగులు చేశాడు. థిలక్ కూడా ముకేష్ బౌలింగ్ లో సమీర్ కు క్యాచ్ ఇచ్చాడు.
హార్దిక్ పాండ్యా వచ్చీ రాగానే 6బంతుల్లో 3పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. దుష్మంత బౌలింగ్ లో ముకేష్ కు దొరికిపోయాడు. వరుసగా వికెట్లు పోతుండగా సూర్య కుమార్ కు నామాన్ ధిర్ జతకలిశాడు 8బంతుల్లో 24పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 180పరుగులు చేసింది.
ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ రెండు వికెట్లు, దుష్మంత్, రహమాన్, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు.