Published On:

Hyderabad: బంగారం కొట్టేశారని బాబుతో సహా తల్లి ఆత్మహత్య!

Hyderabad: బంగారం కొట్టేశారని బాబుతో సహా తల్లి ఆత్మహత్య!

Hyderabad: శుభమా అంటూ పెళ్లికి వెళ్తే పెళ్లి ఇంట్లో బంగారం దొంగతనం చేశారు. అలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్న బందువులను ఏమనాలో ఎవరిని కారణంగా చూపాలో తెలియదు. హైదరాబాద్ లోని చింతల్ కుంటకు చెందిన బందువుల ఇంటికి వివాహానికి హాజరవగా అక్కడ తన 7 తులాల బంగారాన్ని ఎవరో కొట్టేశారు. దీంతో మనస్థాపానికి గురైంది. ఆపై కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటి పరిస్థితుల్లో తులం బంగారం అంటే అటూఇటుగా ఒక లక్ష రూపాయలు అలాంటిది ఏడు తులాలు అంటూ మధ్యతరగతి మహిళకు పెద్దవిషయమే.

 

నాలుగేళ్ల కిందట హైదరాబాద్ చింతల్ కుంట కు చెందిన సుదేష్ట (28)కు సిటీలోని అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్ తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. సుదేష్ట నాచారంలోని బందువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా బంగారం చోరీ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ.. రెండున్నరేళ్ల కుమారుడితో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ చింతల్‌కుంటలో చోటుచేసుకుంది.

 

సుధేష్ణ బంగారం, ఆభరణాలు చోరీకి గురయ్యి దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, తన కుమారుడితో సహా బిల్డింగ్ పైనుంచి దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధేష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: