IPL 2025 : సన్ రైజన్స్ ఆలౌట్.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయలక్ష్యం 164

IPL 2025 : ఐపీఎల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్లో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 1, ఇషాన్ 2, నితీశ్ 0, హెడ్ 22 పరుగులు చేసి తడబడ్డారు. హైదరాబాద్ జట్టును అనికేత్ (74) పరుగులు చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ (32) ఫర్వాలేదనిపించాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు తీశారు. మోహిత్ ఒక వికెట్ పడగొట్టారు.