IPL 2025 Final Match Venue: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలు ఖరారు.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్!

IPL 2025 Final Match Venue: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఫైల్ చేసింది. ముల్లాన్పుర్, అహ్మదాబాద్లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 29న జరిగే క్వాలిఫయర్-1, ఈ నెల 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లకు ముల్లాన్పుర్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్-2 జూన్ 1న, ఫైనల్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్లో జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు వెళ్లాయి. మిగిలిన ఒక బెర్తు కోసం ముంబయి, ఢిల్లీ పోటీపడుతున్నాయి.
ఆర్సీబీ మ్యాచ్ లఖ్నవూలో..
ఈ నెల 23న బెంగళూరు వేదికగా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్కు వాన గండం ఉంది. దీంతో ఈ మ్యాచ్ను లఖ్నవూకు తరలించారు. సన్రైజర్స్తో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ ఈ నెల 27న లఖ్నవూ వేదికగా ఎల్ఎస్జీతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ను కూడా అక్కడికి తరలించారు.